సినిమాల్లో కొన్ని కాంబినేషన్లు సినిమాకు క్రేజ్ తీసుకొస్తాయి. హీరో - హీరోయిన్, హీరో - దర్శకుడు, నిర్మాత – దర్శకడు.. ఇలా కాంబినేషన్లు సినిమాపై హైప్ క్రియేట్ చేస్తాయి. దీంతో ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెరగడంతోపాటు, ట్రేడ్ సర్కిల్స్ లో ఆసక్తి, బిజినెస్ సర్కిల్స్ లో సినిమాకు మంచి డిమాండ్ పెరుగుతుంది. దీంతోపాటు కొత్త కాంబినేషన్లు కూడా సినిమాపై అంచనాలు పెంచుతాయి. ప్రస్తుతం అలాంటి క్రేజ్ క్రియేట్ చేస్తోంది అజయ్ భూపతి దర్శకత్వంలో రాబోతున్న మహాసముద్రం మూవీ. ప్రస్తుతం ఈ సినిమాపై ఓ లేటెస్ట్ న్యూస్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో రౌండ్ అవుతోంది.


ఈ సినిమాలో హీరోగా శర్వానంద్, తమిళ హీరో సిద్ధార్డ్ నటిస్తున్నారనే వార్తలు గతంలోనే వచ్చాయి. కానీ.. సినిమాలో హీరోయిన్ గురించి ఏ న్యూస్ కూడా రాలేదు. ఇప్పుడు లేటెస్ట్ గా రౌంద్ అవుతున్న వార్తలు ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా అదితి రావ్ హైదరీ నటిస్తోందని వార్తలు రౌండ్ అవుతున్నాయి. గ్లామర్ తోపాటు మంచి నటన కూడా అదితి సొంతం. అంతరిక్షం, సమ్మోహనం.. వంటి సినిమాలతో తానేంటో ప్రూవ్ చేసుకుంది కూడా. ప్రస్తుతం నాని, సుధీర్ బాబు హీరోలుగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రాబోతున్న ‘వి’ సినిమాలో అదితి నటించింది. సెప్టెంబర్ నెలలో ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుందని తెలుస్తోంది.


అదితి మహాసముద్రంలో నటిస్తుందనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ విషయంపై పూర్తి అఫిషియల్ న్యూస్ సినిమా టీమ్ నుంచి రివీల్ కావాల్సి ఉంది. ఈ సినిమా ఏకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కనుంది. ప్రస్తుతం దర్శకుడు అజయ్ భూపతి కరోనా వైరస్ బారిన పడి హోమ్ క్వారంటైన్ లో ఉన్నాడు. ప్రస్తుత పరిస్థితులన్నీ చక్కబడ్డాక ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: