సినిమా హీరోయిన్స్ మధ్య వృత్తి పరమైన పోటీ ఉంటుంది. కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయే సంఘటన గురించి చెప్తే ఇలా కూడా జరిగిందా అంటూ ముక్కున వేలేసుకుంటారు. లెజెండరీ నటీమణులు అయినా వాణిశ్రీ మరియు విజయ నిర్మల మధ్య కొన్నేళ్ల పాటు బయట పరపంచానికి తెలియని వార్ జరిగిందట. వాణిశ్రీ సరదాగా అన్న ఒక కామెంట్ ని విజయ నిర్మల సీరియస్ గా తీసుకోవడమే ఇందుకు కారణం. అస్సలు విషయంలోకి వెళ్తే వాణిశ్రీ దేవదాస్ సినిమా చూసి వచ్చి కమెడియన్ రమాప్రభ తో సరదాగా తన అభిప్రాయాన్ని పంచుకుందట. రెండు దశాబ్దాల క్రితం వచ్చిన దేవదాస్ సినిమా ఇప్పటికి థియేటర్లలో నడుస్తుందని, కానీ అదే పేరుతో వచ్చిన విజయ నిర్మల నటించిన దేవదాస్ సినిమా హాళ్లలో దోమలు తప్ప మనుషులు లేరని ఆమె వ్యంగంగా వ్యాఖ్యానించారు.

అది అక్కడే ఉంది విన్న విజయ నిర్మల చాలా సీరియస్ అయ్యారట. మీకు నచ్చకపోతే చూడకండి కానీ మా సినిమాను వెక్కిరించడం ఏంటి అంటూ గయ్యిమని లేచారట. ఇక అప్పటి నుండి వాణిశ్రీ పేరు చెప్తే విజయనిర్మల సహించే వారు కారట. కృష్ణ తో కలిసి అప్పటి నుండి వాణిశ్రీ ఎలాంటి సినిమాలోనూ నటించకూడదని కండిషన్ పెట్టారట. ఇలా ఓకే 15 ఏళ్ళు గడిచిపోయాక అనుకోని పరిస్థితుల్లో వాణి శ్రీ మరియు కృష్ణ గారు ఒక సినిమాలో చేయాల్సి రాగ ఇద్దరు సమ్మతించారు. ఆ సినిమా పేరు రావు గారింట్లో రౌడీ. ఈ సినిమాలో వాణిశ్రీ కృష్ణ గారితో చేయాల్సి ఉండగా షూటింగ్ మొదలు పెట్టిన రోజు విజయ నిర్మల అక్కడికి వచ్చి నానా గొడవ చేసి కృష్ణ గారిని అక్కడ నుండి తీసుకెళ్లిపోయారట. ఇక అయన పాత్రలో సుమన్ తో సినిమాను తీశారు. ఇలా ఇద్దరు హీరోయిన్స్ మధ్య తారాస్థాయిలో ఈగో సమస్యలు ఉండటం అనేది నిజంగా చాలా పెద్ద విషయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: