ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ క్రేజీ హీరోలలో ఒకరు ఆయన గోపీచంద్ స్పీడ్ మామూలుగా లేదు. సీటి మార్ సినిమా కంటే ముందు వరుస పరాజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదుర్కొన్న గోపీచంద్ 'సీటి మార్' మూవీ తో అదిరిపోయే మాస్ కమర్షియల్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకని ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. సిటీ మార్ మూవీ తో సక్సెస్ ని అందుకున్న గోపీచంద్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ మూవీ లో హీరోగా నటించాడు.

ఈ సినిమాలో గోపీచంద్ లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు.  ఈ సినిమా జూలై 1 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. రాశి కన్నా హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ని యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మించారు.  ఈ సినిమాకి జాక్స్ బీజాయ్ సంగీతాన్ని సమకూర్చాడు. పక్కా కమర్షియల్ మూవీ సెట్స్ పై ఉండగానే గోపీచంద్, శ్రీ వాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే  ఒక మూవీ కి కమిట్ అయ్యాడు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.  ఇప్పటికే గోపీచంద్ ,  శ్రీ వాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన లక్ష్యం , లౌక్యం సినిమాలు మంచి విజయాలను సాధించడంతో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూడో మూవీ పై సినీ ప్రేమికుల్లో  మంచి అంచనాలు ఉన్నాయి.  

గోపీచంద్ ఈ మూవీ తో పాటు జేబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో కూడా ఒక సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అనేది మాత్రం ఇప్పటి వరకు కన్ఫామ్ కానట్లు తెలుస్తుంది. కాకపోతే ఈ సినిమాకు ఒక అదిరిపోయే మాస్ కమర్షియల్ డైరెక్టర్ ను దర్శకుడిగా తీసుకోవాలని చిత్ర బృందం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా సిటి మార్ మూవీ తో ఫామ్ లోకి వచ్చిన గోపీచంద్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడితే ఫుల్ స్పీడ్ లో ముందుకు  దూసుకుపోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: