తెలుగు చిత్ర పరిశ్రమలో అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ ను అందుకున్న హీరోల లో యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా ఒకడు..వరుస హిట్ సినిమా లలో నటిస్తూ వస్తున్నాడు..అయితే ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేదని తెలుస్తుంది.అయిన విజయ్ దేవరకొండ  క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు..అర్జున్ రెడ్డి తో ఒక్కసారిగా స్టార్ అయిన విజయ్… ఇటీవల లైగర్ తో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు.



మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్ట్ 25న విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక లైగర్ ప్లాప్ అనంతరం విజయ్ తన తదుపరి చిత్రం ఖుషి చిత్రీకరణ పై దృష్టి పెట్టాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లో పాల్గోంటున్నాడు. అయితే తాజాగా విజయ్ దేశ సరిహద్దుల్లో డ్యూటీ చేస్తున్న జవాన్లతో కొంత సమయాన్ని గడిపారు. ఎన్డీటీవీ ఛానల్ ప్రత్యేకంగా విజయ్ దేవరకొండతో కలిసి జై జవాన్ అనే కార్యక్రమం రూపొందించింది. కొద్దిరోజులుగా జవాన్లతో విజయ్ కలిసున్న ఫోటోస్ రిలీజ్ కాగా.. తాజాగా దీపావళి సందర్భంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ విడుదలయ్యింది..



జవాన్లను కలిసి వారి విధి విధినాలను.. డ్యూటీలో ఉన్న వారి సాధక బాధలు తెలుసుకున్నారు. అంతేకాకుండా కొన్ని యుధ్ధ సాంకేతికలను తెలుసుకున్నాడు. ఫైరింగ్, బోటింగ్ ఎలా చేయాలో తెలుసుకోవడమే కాకుండా.. వారితో కలిసి కొన్ని గేమ్స్ ఆడారు. లైగర్ చిత్రం నుంచి ఓ డైలాగ్ కూడా వినిపించాడు. దీపావళి సందర్భంగా ప్రసారమైన ఈ జై జవాన్ ఎపిసోడ్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.కాగా, ప్రస్తుతం విజయ్ డైరక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సమంత కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం ఈ షూటింగ్ వేగంగా జరుగుతుంది.ఈ సినిమా పై విజయ్ ఆశలు పెట్టుకున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: