అద్భుతమైన టాలెంట్ ఉన్న డాన్స్ కొరియోగ్రాఫర్ లలో ఒకరు అయినటువంటి జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జానీ మాస్టర్ ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన రచ్చ మూవీ లోని పాటలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించి అద్భుతమైన గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీలో దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో టాలీవుడ్ సినిమాలకు కొరియోగ్రాఫర్ గా వర్క్ చేసిన జానీ మాస్టర్ తన కొరియోగ్రఫీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డాన్స్ మాస్టర్ లలో ఒకరిగా మారిపోయాడు. 

ఇది ఇలా ఉంటే జానీ మాస్టర్ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాలకు కూడా కొరియోగ్రాఫర్ గా వ్యవహరించి ఇండియా స్థాయిలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లోని కొన్ని పాటలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. 

తాజాగా జానీ మాస్టర్ తమిళ స్టార్ హీరో తళపతి విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వారిసు మూవీ లోని రంజితమే సాంగ్ కు కొరియోగ్రఫీ చేశాడు. ఈ సాంగ్ ద్వారా కూడా జానీ మాస్టర్ కు మంచి గుర్తింపు లభించింది. ఈ పాటకు ఇప్పటికి కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా జానీ మాస్టర్ తనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అని ... కన్నడ సినిమా ఇండస్ట్రీలో పునీత్ రాజ్ కుమార్ అంటే ఇష్టం అని ... తమిళ సినిమా ఇండస్ట్రీలో తలపతి విజయ్ అంటే ఇష్టం అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: