ముఖ్యంగా సముద్ర జలాల గురించి కూడా ఈ సినిమాలో చర్చకు వస్తుందట. ఎన్టీఆర్ కు జోడిగా బాలీవుడ్ అందాల తార జాన్వి కపూర్ పేరు వినిపిస్తూ ఉండగా నిర్మాతలు మాత్రం ఇంకా ఆమె పేరును ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. నిజంగా ఈమె నటిస్తోందా ? లేకపోతే ఈమె స్థానంలో మరొక హీరోయిన్ ఎవరైనా వస్తారా? అనేది ఇంకా వెలబడలేదు. ఇకపోతే ఎన్టీఆర్ కి జోడిగా మొన్నా మద్యకాలంలో రష్మిక పేరు కూడా వినిపించింది. అయితే ఆమె పుష్ప 2 సినిమాలో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాలో నటించడానికి నో చెప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి.
మరొకవైపు ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ క్రేజీ ను మరింత పెంచేలా తర్వాత ప్రాజెక్టు ఉండాలి అని ప్రశాంత్ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుండగా.. ఈ ఏడాది ఎన్టీఆర్ సినిమాలేవి రిలీజ్ కావడం లేదు. అయితే వచ్చే ఏడాది నుంచి ఏడాదికి ఒక సినిమా ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకి రానుంది. పారితోషకం విషయంలో కూడా ఈయన ఆచితూచి అడుగులేస్తున్నారని సమాచారం . ఈ క్రమంలోనే రూ. 70 నుంచి రూ. 120 కోట్ల రూపాయల స్థాయిలో పారితోషకం తీసుకోబోతున్నారు.