తాజాగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తన దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక మెసేజ్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే . ఈ క్రమంలోనే  ఆచార్య సినిమా డిజాస్టర్ గా నిలవడానికి ఆ సినిమాలో శివ మార్క్ సన్నివేశాలు లేకపోవడమే కారణమని కామెంట్లు కూడా వినిపించాయి.  ఇప్పుడు ఎన్టీఆర్ 30వ సినిమాలో కూడా ఎన్టీఆర్ కొంత సమయం పాటు జాలరిగా కూడా కనిపిస్తారని సమాచారం. ఈ విషయం కూడా  బాగా వైరల్ అవుతుంది.  నిజానికి వాల్తేరు వీరయ్యలో చిరంజీవి పాత్ర ఏ విధంగా ఉంటుందో.. ఎన్టీఆర్ 30 సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కూడా అదేవిధంగా ఉంటుంది అని.. ఇండస్ట్రీలో కొంతమంది కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.

ముఖ్యంగా సముద్ర జలాల గురించి కూడా ఈ సినిమాలో చర్చకు వస్తుందట. ఎన్టీఆర్ కు జోడిగా బాలీవుడ్ అందాల తార జాన్వి కపూర్ పేరు వినిపిస్తూ ఉండగా నిర్మాతలు మాత్రం ఇంకా ఆమె పేరును ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. నిజంగా ఈమె నటిస్తోందా ? లేకపోతే ఈమె స్థానంలో మరొక హీరోయిన్ ఎవరైనా వస్తారా?  అనేది ఇంకా వెలబడలేదు. ఇకపోతే ఎన్టీఆర్ కి జోడిగా మొన్నా మద్యకాలంలో రష్మిక పేరు కూడా వినిపించింది. అయితే ఆమె పుష్ప 2 సినిమాలో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాలో నటించడానికి నో చెప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి.

మరొకవైపు ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ క్రేజీ ను మరింత పెంచేలా తర్వాత ప్రాజెక్టు ఉండాలి అని ప్రశాంత్ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుండగా.. ఈ ఏడాది ఎన్టీఆర్ సినిమాలేవి రిలీజ్ కావడం లేదు.  అయితే వచ్చే ఏడాది నుంచి ఏడాదికి ఒక సినిమా ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకి రానుంది. పారితోషకం విషయంలో కూడా ఈయన ఆచితూచి అడుగులేస్తున్నారని సమాచారం . ఈ క్రమంలోనే రూ. 70 నుంచి రూ. 120 కోట్ల రూపాయల స్థాయిలో పారితోషకం తీసుకోబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: