నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇలా సినిమాల ద్వారా ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న బాలకృష్ణ ప్రస్తుతం అన్ స్టాపబుల్ సీజన్ 2 అనే టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ టాక్ షో ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటువంటి ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే అన్ స్టాపబుల్ సీజన్ 1 కు బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించాడు.  సీజన్ 1 సూపర్ సక్సెస్ ను సాధించింది. ప్రస్తుతం సీజన్ 2 విజయవంతంగా రన్ అవుతుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ టాక్ సెకండ్ సీజన్ కు ఎంతో మంది గెస్ట్ లు విచ్చేశారు. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ తాజాగా వీర సింహా రెడ్డి అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో శృతి హాసన్ , హాని రోజ్ లు హీరోయిన్ లుగా నటించగా ... వరలక్ష్మి శరత్ కుమార్ ... దునియా విజయ్మూవీ లో ఇతర కీలకపాత్రలో నటించారు. తమన్మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ఈ రోజు అనగా జనవరి 12 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూనిట్ తాజాగా అన్ స్టాపబుల్ సీజన్ 2 లోని ఒక ఎపిసోడ్ కు విచ్చేశారు. ఈ ఎపిసోడ్ కు డైరెక్టర్ గోపీచంద్ మలినేని నటులు వరలక్ష్మి శరత్ కుమార్ ... హనీ రోజ్ లు గెస్ట్ లుగా వచ్చారు. ఈ ఎపిసోడ్ ను  ఈనెల జనవరి 13 వ తేదీన ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: