అక్కినేని అఖిల్ ఆఖరుగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందినటు వంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో పూజా హెగ్డే ... అఖిల్ సరసన హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ మూవీ తో అఖిల్ కూడా తన కెరీర్ లో హీరోగా మొట్ట మొదటి విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ తో కెరియర్ లో మొట్ట మొదటి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. 

మమ్ముట్టి ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తూ ఉండగా ... టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డిమూవీ కి దర్శకత్వం వహించాడు. ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించిన ఈ మూవీ కి హిప్ హప్ తమిజ సంగీతం అందించాడు. సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదలకు ఇంకా కేవలం 5 రోజుల మాత్రమే మిగిలి ఉంది. దానితో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ మూవీ బృందం వరస టీవీ షో లలో ... వరస ఇంటర్వ్యూ లలో పాల్గొంటుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూనిట్ ఈ రోజు వరంగల్ లో భారీ ఎత్తున ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతోంది. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు నాగార్జున ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. అలాగే ఈ మూవీ యూనిట్ హైదరాబాద్ లో కూడా మరో భారీ ఈవెంట్ ను నిర్వహించడానికి పాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: