టాలీవుడ్ లో యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పలు చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. కార్తికేయ-2 చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న నిఖిల్ ఆ తర్వాత 18 పేజీస్ అనే చిత్రంతో పర్వాలేదు అనిపించుకున్నారు. తాజాగా ఇప్పుడు మరొకసారి పాన్ ఇండియా లేవలో తెరకెక్కిస్తున్న చిత్రం స్పై ఈ చిత్రాల్లో హీరోయిన్గా ఐశ్వర్య మీన నటిస్తూ ఉంది.. డైరెక్టర్ గ్యారీ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రం జూన్ 29వ తేదీన పాన్ ఇండియా లెవల్ గా విడుదల చేయబోతున్నారు.



సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న రహస్యాలు ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఇక స్పై టీజర్ ఈనెల 15వ తేదీన రాజధాని ఢిల్లీలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఉండే కర్తవ్యపథ్ దగ్గర విడుదల చేయబోతున్నట్లు సమాచారం... ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడం జరిగింది. దీంతో ఈ ప్లేస్ లో ఫస్ట్ టైం ఒక సినిమాకి సంబంధించిన కార్యక్రమం జరగబోతున్నట్లుగా తెలియజేశారు. ఇది కూడా సస్పెన్స్  థ్రిల్లర్ గా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఇప్పుడు టీజర్ కూడా గ్రాండ్గా ఢిల్లీలో విడుదల చేస్తూ ఉండడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోతున్నాయి.


సినిమా స్పై సినిమాతో కూడి తిట్టుకొట్టి హ్యాట్రిక్ విజయం సాధించాలని నిఖిల్ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. నిఖిల్ మొదట్లో పలు చిత్రాలు నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. కానీ ఆ తర్వాత స్వామి రారా , కార్తికేయ తదితర చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు ఇక అప్పటినుంచి ఎక్కువగా ఇలాంటి చిత్రాలని నటిస్తూ తన కెరియర్ ని ముందుకు తీసుకువెళ్తున్నారు. తెలుగు హీరోలలో పాన్ ఇండియా హీరోగా సక్సెస్ అయిన హీరో నిఖిల్ మాత్రమే అని చెప్పవచ్చు. ఒకో చిత్రానికి కొన్ని కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: