గత సీజన్ లో తమ తమ ఫ్రాంచైజీల తరఫున కొనసాగిన ఆటగాళ్లలో ఎవరినైనా తొలగించాలని భావిస్తే, యాజమాన్యాలు ఈ నెల 21 లోగా జాబితాను పంపించాలని ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) చైర్మన్ బ్రిజేశ్ పటేల్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎనిమిది ఫ్రాంచైజీల యాజమాన్యాలకూ సమాచారాన్ని పంపించామని తెలిపారు.