పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీకి షాక్ తగిలింది. ఆ పార్టీ పశ్చిమ బెంగాల్ తాత్కాలిక అధ్యక్షుడు ఎస్కే అబ్దుల్ కలాం తన మద్దతుదారులతో కలిసి నిన్న అధికార తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. దేశవ్యాప్తంగా తన పార్టీని విస్తరించేందుకు యత్నిస్తున్న అసద్కు ఇది ఎదురుదెబ్బేనని చెబుతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి.