మూడు నెలలుగా రైతులు చేస్తున్న పోరాటాన్ని కొంచెం కూడా పట్టించుకోవట్లేదు కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటికే రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య తొమ్మిది సార్లు భేటీ లు జరగగా ఫలితం మాత్రం శూన్యం.. వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయడమే లక్ష్యంగా రైతు సంఘాలు భీష్మించుకు కూర్చుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం సవరణలు చేయడానికే ఎక్కువగా సిద్మవుతూ ఈ భేటీ ని రోజు రోజు కి పొడిగించుకుంటూ వెళ్తున్నారు. ఎవరికీ వారి పట్టుదలతో ఉండడంతో చలిని సైతం లెక్క చేయకుండా సామాన్య రైతులు పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.