టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ వారణాసి పర్యటనలో సరదాగా బోటుపై విహరిస్తూ పక్షులకు ఆహారం వేస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. ఈ ఫొటోలను శిఖర్ ధావన్ ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నాడు. పక్షులకు మేత తినిపించడం ఎంతో సంతోషదాయకం అని ధావన్ పేర్కొన్నాడు. ధావన్ సంతోషం ఏమో కానీ, ధావన్ ఎక్కిన ఆ బోటు యజమాని మాత్రం చిక్కుల్లో పడ్డాడు.