ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన విషయం తెలిసిందే. నేటి నుంచి తొలి దశ ఎన్నికల నామినేషన్లను స్వీకరించనున్నారు. అయితే, కరోనా నేపథ్యంలో ఈ ఎన్నికలు జరపడం సరికాదని ప్రభుత్వం అంటోంది. ఈ పరిస్థితుల మధ్య తొలి దశ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేసేందుకు వచ్చిన ఓ అభ్యర్థికి వింత అనుభవం ఎదురైంది.