బుల్లితెరపై మెరిసి ఇప్పుడు వెండితెరపై ఫుల్ బిజీ గా మారిపోయిన యాంకర్, నటి అనసూయ.. జబర్దస్త్ షో ఆమె రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అంతకుముందు చిన్న చిన్న షో లు చేసినా రాని గుర్తింపు జబర్దస్త్ అనే ఒక్క షో తో వచ్చింది.. ఆ షో లో వచ్చిన గుర్తింపుతోనే ఆమె సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. క్షణం సినిమా తో పూర్తి స్థాయి నటిగా మారిన అనసూయ ఆ తర్వాత వెండితెరపై ఇక వెనుతిరిగి చూసుకోలేదు.. వరుస సినిమాలు చేస్తూ వెండి తెరపై ప్రేక్షకులను అలరిస్తుంది. ఆ సినిమా లో నెగెటివ్ రోల్ అదరగొట్టి తనలోని కొత్త యాంగిల్ ని చూపెట్టింది. రంగమ్మత్త గా ఆమె ప్రేక్షకులను ఎంతగానో అలరించింది..