నేషనల్ సెలెబ్రెటీలుగా మారాలని ప్రయత్నాలు చేస్తున్న
చరణ్ జూనియర్ ల ఆలోచనలలో చాల మార్పులు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ‘సాహో’ ‘సైరా’ ఫలితాలు అని అంటున్నారు.
‘
సాహో’ ‘సైరా’ లు అత్యంత భారీ బడ్జెట్ తో అదేవిధంగా భారీ ప్రమోషన్ తో విడుదల చేసినా ఈ రెండు మూవీలకు వాటివాటి స్థాయిలలో చేదు అనుభవాలు ఎదురైన పరిస్థుతులలో
చరణ్ జూనియర్ లు ప్రస్తుతం తాము నటిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’
మూవీ తరువాత తమ వ్యూహాలు మార్చుకుంటున్నట్లు టాక్. ‘ఆర్ ఆర్ ఆర్’ నిర్మాణ సమయంలో ఎదురౌతున్న సమస్యలతో పాటు ఎన్ని ప్రయత్నాలు చేసి ఎంత కష్టపడ్డా
బాలీవుడ్ ప్రేక్షకులను అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాల ప్రేక్షకులను మెప్పించడం చాల కష్ట సాధ్యం అన్న విషయం వీరిద్దరికీ ‘సైరా’ ‘సాహో’ ల పరాజయం పరోక్షంగా తెలియచేసింది అని అంటున్నారు.
దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత
చరణ్ జూనియర్ లు ఎవరికీ వారు పాన్
ఇండియా స్థాయిని వదిలి తెలుగు
మార్కెట్ కు సంబంధించిన సినిమాలను మాత్రమే చేయాలని ఒక స్థిర నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగానే జూనియర్
త్రివిక్రమ్ తో
చరణ్ కోరతాలతో సినిమాలు చేయడానికి ఇప్పటికే ఒక ప్రాధమీక అంగీకారానికి వచ్చి వీరిద్దరూ
త్రివిక్రమ్ కొరటాలకు లైన్ క్లియర్ చేసి కథలు వినిపించమని ఇప్పటికే సందేశాలు ఇచ్చినట్లు టాక్.
దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలై ఆ
మూవీ ఫలితం తెలియకుండానే జూనియర్
చరణ్ లకు పాన్
ఇండియా మూవీల పై మోజు తీరిందా అంటూ కామెంట్స్ వస్తున్నాయి. వాస్తవానికి
రజినీకాంత్ కమలహాసన్ లాంటి టాప్ దక్షిణాది హీరోలు నేషనల్ సెలెబ్రెటీలుగా మారాలని ఎన్నో ప్రయత్నాలు చేసి వారి పరిధి దక్షిణాదిని దాటలేదు అన్న విషయాన్ని ఇప్పటికే గ్రహించారు. ఇప్పుడు
చరణ్ జూనియర్ లు కూడ ఈ వాస్తవాన్ని చాల ముందుగానే గ్రహించారు అంటూ
ఇండస్ట్రీ వర్గాలలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు..