అత్యంత భారీ బడ్జెట్ సినిమాలకు చిరునామ దర్శకుడు శంకర్. ‘బాహుబలి’ విడుదల అయ్యేంతవరకు శంకర్ రేంజ్ ని అందుకోగల దర్శకుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో లేడు. అయితే ‘బాహుబలి’ ఘన విజయంతో శంకర్ రికార్డులు తుడుచు పెట్టుకుపోయాయి. 

దీనికితోడు శంకర్ లేటెస్ట్ గా తీసిన ‘2.0’ కూడ ఊహించిన స్థాయిలో విజయం సాధించక పోవడంతో శంకర్ ఇమేజ్ మసకబారడంతో శంకర్ ప్రస్తుతం రెట్టించిన ఉత్సాహంతో ‘భారతీయుడు 2’ తీస్తున్నాడు. ఈ సినిమా నిర్మాణంలో బిజీగా ఉన్న శంకర్ ఈమధ్య ప్రభాస్ ను కలిసి ఒక సామాజిక చైతన్యం కలిగించే కథ తన వద్ద ఉందనీ ఆ మూవీకి ‘బాహుబలి’ నుంచి బడ్జెట్ అవుతుందనీ ప్రభాస్ అంగీకరిస్తే తాను ఆ స్టోరీ లైన్ డెవలప్ చేస్తాను అంటూ శంకర్ ప్రభాస్ కు ఆఫర్ ఇచ్చినట్లు టాక్. 

ప్రభాస్ శంకర్ చెప్పిన మాటలు అన్నీ విని ‘భారతీయుడు 2’ హడావిడి అయిన తరువాత ఈ మూవీ సబ్జెక్ట్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం అని ప్రభాస్ సున్నితంగా సమాధానం చెప్పి ఈ భారీ ప్రాజెక్ట్ ను కూడ తన వెయిటింగ్ లిస్టులో పెట్టుకున్నట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు ప్రభాస్ శంకర్ ల మధ్య జరిగిన ఈ మీటింగ్ కు నిర్మాత దిల్ రాజ్ తెర వెనుక సూత్రధారిగా వ్యవహరించాడు అన్న వార్తలు వస్తున్నాయి. 

వాస్తవానికి బాలీవుడ్ లో ప్రభాస్ తో ‘ధూమ్ 4’ సిరీస్ మూవీని చేయడానికి కూడ ఇప్పటికే ప్రభాస్ కు ముంబాయి నుండి రాయబారాలు రావడమే కాకుండా ఈ మూవీలో ప్రభాస్ నటిస్తే 80 కోట్ల పారితోషికం బిజినెస్ లో షేర్ ఇస్తామని ఆఫర్లు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాల పై ప్రభాస్ ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోలేక ఇప్పటికే మొదలు పెట్టిన ‘జాను’ మూవీని పూర్తి చేయకుండా తరుచు ప్రభాస్ విదేశాలకు వెళ్ళి పోవడం చూస్తుంటే ప్రభాస్ తనకు ఏర్పడిన క్రేజ్ ను పూర్తిగా వినియోగించుకోలేక పోతున్నాడా అంటూకొంతమంది కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: