బుల్లితెర మీద యాంకర్ గా టాలెంట్ చూపిస్తున్న వారిలో కొంతమంది ఇలా వచ్చి అలా వెళ్తుంటారు.. కాని కొందరు మాత్రం కొన్నేళ్లుగా అలా ఉండిపోతారు. ఇప్పటికి సుమ, ఝాన్సి వంటి సీనియర్ యాంకర్స్ ఫాం కొనసాగిస్తున్నారు అంటే అది వారి ప్రతిభ అని చెప్పొచ్చు. అయితే యాంకర్ లో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు కొందరు భామలు. అనసూయ, రష్మి గౌతమ్ మరో పంథా కొనసాగిస్తారు.. తమ క్యూట్, హాట్ అందాలతో ఆడియెన్స్ ను మెప్పించడమే వీరి స్టైల్. ఇక శ్రీముఖిది మరో స్టైల్ అని చెప్పొచ్చు. అయితే ఎప్పుడో దశాబ్ధ కాలంగా యాంకరింగ్ చేస్తూ వచ్చినా అంత గొప్పగా ఐడెంటిటీ తెచ్చుకోలేని యాంకర్ మంజూషా.  

 

యాంకర్ గా తన టాలెంట్ చూపిస్తూ వచ్చిన ఈ అమ్మడు కొన్నాళ్లు కెరియర్ లో చాలా వెనుకపడ్డది. ఈమధ్య తరచు ఇంటర్వ్యూస్ లో కనిపిస్తున్న మంజూషా ఇప్పటికి గాని ఎలా ఎదగాలో తెలుసుకుంది. కొద్దిగా వెనుకపడితే మర్చిపోయే రోజులివి. అందుకే తరచు ఆడియెన్స్ ముందుకు వస్తూనే ఉంటాడి. సోషల్ యాండిల్స్ లో కూడా రెగ్యులర్ అప్డేట్స్ తో ఉండాలి. ఇక యాంకర్లుగా మేమేమి హీరోయిన్స్ కు తక్కువేం కాదు అన్నట్టుగా ఫోటో షూట్స్ చేయాలి. ఇవన్ని ఈమధ్యనే చేస్తుంది మంజూషా.

 

ఇక యాంకర్స్ అందరు బాగా పాపులర్ అయిన షోలకు గెస్టులుగా వెళ్లడం కామనే. ముఖ్యంగా కాస్త క్రేజ్ ఉన్న ప్రతి యాంకర్ జబర్దస్త్ లో ఒక స్కిట్ లో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తారు. అలా ఈ వారం ఆది స్కిట్ లో మంజూషా జబర్దస్త్ లో మెరిసింది. ఆదిని బావా అని పిలుస్తూ ఆమె చేసిన స్కిట్ సూపర్ గా వచ్చిందట. ప్రస్తుతం ఈ ప్రోమో చూసిన మంజూషా ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషిగా ఉన్నారు. జబర్దస్త్ లో మంజూషాని చూసి ఇన్నాళ్లకు అమ్మడికి పబ్లిసిటీ బల్బ్ వెలిగినట్టుందని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: