ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి తనకంటూ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆనంద్ రాజ్ తమ్ముడు కనక సబై ఆత్మహత్య చేసుకోవడం సంచలనం గా మారిన విషయం తెలిసిందే. నటుడి తమ్ముడు ఆత్మహత్య చేసుకోవడంతో మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే తాజాగా నటుడు ఆనంద్ రాజ్ తమ్ముడు కనక సబై ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అయితే ఆనంద్ రాజ్ తమ్ముడు కనక సబై ఆత్మహత్యకు ముందు వ్రాసిన ఒక సూసైడ్ నోట్ను పోలీసులు కనుగొన్నారు. ఈ సూసైడ్ నోట్ లో సంచలన నిజాలు బయటపడ్డాయి. తన ఆత్మహత్యకు కారణమైన వారి గురించి ఈ లేఖలో పేర్కొన్నాడు నటుడు ఆనంద్ రాజ్ తమ్ముడు కనక సబై .
అయితే మామూలుగా నటుడు ఆనందరావు సినిమాల్లో నటిస్తుండగా అతని తమ్ముడు కనక సబై వడ్డీ వ్యాపారం చిట్టీల వ్యాపారం చేస్తూ ఉంటాడు. అయితే ఇటీవలే పుదుచ్చేరిలోని స్వగృహంలో ఆనంద్ రాజ్ తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే వడ్డీ వ్యాపారం చిట్టీ వ్యాపారంలో నష్టం వచ్చిన కారణంగానే అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు మొదట భావించారు. కానీ ఆనంద్ రాజ్ తమ్ముడు కనకసబై వ్యాపారంలో ఎలాంటి నష్టాలు లేవని... వ్యాపారం అంతా సవ్యంగానే సాగిపోతుందని... తన తమ్ముడి ఆత్మహత్య వెనుక అసలు కారణం వేరే ఉండవచ్చు అని నటుడు ఆనంద్ రాజ్ అనుమానం వ్యక్తం చేశారు.
తన తమ్ముడు కనక సబై ఇటీవలే ఓ ఇంటిని కొనుగోలు చేశాడని... ఆ ఇంటిని కాచేయడానికి కొందరు వేసిన కుట్రలో భాగంగా తమ తమ్ముడు తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఇక ఈ కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఓ సూసైడ్ నోట్ను కనుగొన్నారు. తాను ఆత్మహత్య చేసుకొని చనిపోవడానికి కారణం తన అన్నయ్య భాస్కర్ అతని కొడుకు శివ చంద్రన్ అని కనక సబై సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వారిద్దరిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం వారిద్దరిని జైలుకు తరలించారు.