ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలోకి మాలీవుడ్ బ్యూటీలు వరుసగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇవ్వడమే కాదు మంచి విజయాలు తమ ఖాతాలో వేసుకొని తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఛాన్స్ దక్కించుకుంటున్నారు. ఇక మాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్ తెలుగు లో రామ్ హరోగా నటించిన నేను శైలజ, నాని హీరోగా నటించిన నేను లోకల్ చిత్రాలతో మంచి విజయం అందుకుంది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అలనాటి అందాల తార సావిత్రి జీవిత కథ ఆధారంగా ‘మహానటి’ లో సావిత్రమ్మ పాత్ర వేసింది. ఈ పాత్రలో నిజంగా ఆనాటి సావిత్రి వచ్చి మన కళ్లముందు మళ్లీ నటించిందా అన్నంత గొప్పగా ఆకర్షించింది. 'మహానటి' చిత్రంతో అశేష సినీ ప్రేక్షకులను అలరించిన కీర్తి సురేష్ తర్వాత తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఛాన్స్ దక్కించుకొని స్టార్ హీరోల సరసన నటిస్తుంది.
అందమైన రూపం, చక్కని హావభావాలతో అందరినీ అలరించి, మెప్పించిన కీర్తి, ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమై, సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులను పలకరిస్తూ ఉంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ లో ఆమెను ఫాలో అవుతున్న వారి సంఖ్య 50 లక్షలను దాటగా, ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి, ఆమె ఓ వీడియోను తయారు చేసి పోస్ట్ చేసింది. తన పెట్ డాగ్ తో కలిసి ఈ వీడియోను రూపొందించింది.
మనది ఇప్పుడు 50 లక్షల మందితో నిండిన కుటుంబమని, తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఎంతో సంతోషిస్తున్నానని పేర్కొంది. ఈ వీడియోలో కీర్తీ సురేశ్ మేకప్ లేకుండా కనిపించడం గమనార్హం. తాజాగా కీర్తి సురేష్ , 'పెంగ్విన్', 'మిస్ ఇండియా', 'రంగ్ దే' తదితర చిత్రాల్లో నటిస్తోంది. అయితే, ప్రస్తుతానికి మాత్రం ఈ సినిమాల షూటింగ్, ప్రీ ప్రొడక్షన్ పనులు నిలిచిపోగా, నిబంధనలు తొలగిపోగానే కీర్తి బిజీ కానుంది.
View this post on InstagramWe are now a family of 5 million!! Nyke & I couldn’t have been more grateful for all your love 💋 #5MOnInstagram #NykeDiaries . . . #5million #grateful #blessed #instafam #5millionfollowers #milestone