ప్రస్తుతం టాలీవుడ్ లో బుట్ట బొమ్మ పూజా హెగ్దే టైం నడుస్తుంది. వరుస స్టార్ అవకాశాలతో ఆమె హంగామా చేస్తుంది. తెలుగులో ఆమె చేస్తున్న సినిమాలన్ని వరుస సక్సెస్ అవుతుండగా ఆమెకు వరుస ఛాన్సులు ఇస్తున్నారు స్టార్స్. ప్రస్తుతం అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా చేస్తున్న పూజా హెగ్దే ప్రభాస్ రాధే శ్యాం సినిమాలో కూడా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత మరో రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో కూడా అమ్మడు లాక్ అయినట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం కమిటైన సినిమాలు కాకుండా తన నెక్స్ట్ సినిమా కోసం అమ్మడు భారీగా డిమాండ్ చేస్తుంది. ఒక్కో సినిమాకు పూజా హెగ్దే 3 కోట్ల దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది. తప్పకుండా పూజా హెగ్దే అడిగినంత ఇచ్చేందుకు నిర్మాతలు ఏమాత్రం ఆలోచించడం లేదు. అల్లు అర్జున్ డీజే సినిమా నుండి ఈ ఇయర్ మొదట్లో వచ్చిన అల వైకుంఠపురములో వరకు అమ్మడు చేసిన సినిమాలన్ని దాదాపు హిట్లే అయ్యాయి. అందుకే పూజా హెగ్దేకి ఇక్కడ ఫుల్ క్రేజ్ ఏర్పడింది.

అందుకే ఆమె సినిమాకు 3 కోట్ల దాకా ఛార్జ్ చేస్తుందని తెలుస్తుంది. పూజా హెగ్దే సినిమాలో ఉంటే గ్లామర్ విషయంలో ఎలాంటి ఢోకా లేదు. అమ్మడు సినిమా చేస్తే మాత్రం అందులో ఆమె స్కిన్ షో స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుంది. టాలీవుడ్ లో పూజా క్రేజ్ పీక్స్ లో ఉండగా అందుకు తగినట్టుగానే అమ్మడు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంది.                                                                        


మరింత సమాచారం తెలుసుకోండి: