ప్రస్తుతం బుల్లితెరపై బొమ్మ అదిరింది షో ఎంత క్రేజ్ సంపాదించిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక సాదాసీదా కామెడీ షో గా మొదలైన బొమ్మ అదిరింది షో ప్రస్తుతం టాప్ రేటింగ్ సొంతం చేసుకుని బుల్లితెర ప్రేక్షకులందరికీ తమ వైపుకు తిప్పుకుంది.  ముఖ్యంగా నాగబాబు నవ్వులు  ఈ షో కి స్పెషల్ ఎట్రాక్షన్ తెచ్చిపెడుతున్నాయి. ఇక ఇప్పుడు నాగబాబు తో పాటు జానీ మాస్టర్ కూడా తోడవడంతో ఇది మరింత క్రేజ్ వచ్చింది అనే చెప్పాలి. ఇక ప్రతివారం సరికొత్త స్కిట్స్ తో  బొమ్మ అదిరింది షోలో కమెడియన్స్ బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు.


 అదిరింది షో వస్తుందంటే చాలు బుల్లితెర ప్రేక్షకులు అందరూ టీవీలకు అతుక్కుపోయి ఈ షో వీక్షిస్తూ ఉంటారు. ప్రతి ఆదివారం జీ తెలుగు లో ప్రసారమయ్యే ఈ షో బుల్లితెర ప్రేక్షకులకు ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఈ షోలో కామెడీ ఎంతో నాచురల్ గా ఉంటుంది. అందుకే  బుల్లితెర ప్రేక్షకులకు తెగ నచ్చేస్తూ  ఉంటుంది. అయితే ఇటీవలే బొమ్మ అదిరింది షో లో భాగంగా యాంకర్ శ్రీముఖి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే శ్రీముఖి ఏ షో  చేసిన తన వాక్చాతుర్యంతో అదరగొడుతోంది. ఈ క్రమంలోని బొమ్మ అదిరింది షో  కూడా ఎంతో రక్తి కట్టిస్తుంది శ్రీముఖి.



 అయితే శ్రీముఖి యాంకర్ గా ఉంది అంటే చాలు ఇతరులపై పంచులు వేయడమే కాదు తనపై కూడా ఎన్నో పనులు వేయించుకుంటుంది. ఇక ఇటీవలే విడుదలైన బొమ్మ అదిరింది ప్రోమో లో భాగంగా సద్దాం హుస్సేన్ స్కిట్ చేస్తున్న సమయంలో.. రాజు వేషంలో  శ్రీముఖి దగ్గరికి వస్తాడు సద్దాం హుస్సేన్. హీరో రాజశేఖర్ లాగా శ్రీముఖి ముందు డాన్స్ చేస్తాడు. అంతలో స్కిట్ మొదలుపెట్టిన సద్దాం హుస్సేన్ శ్రీముఖి తన మొదటి భార్య అంటు చెబుతాడు దీంతో జానీ మాస్టర్ శ్రీముఖి ఒక్కసారిగా షాక్ అవుతారు. తనకు జ్యోతిష్యుడు చెప్పాడని వాస్తు ప్రకారం కుడివైపు బరువు ఉంచాలి అని చెప్పడంతో శ్రీముఖుని మొదటి పెళ్లి చేసుకుని అక్కడ బరువు పెట్టాను  అంటూ పంచ్ వేయడంతో అందరు నవ్వుకుంటారు. ఇక అదే సమయంలో శ్రీముఖి పై ఇలాంటి పంచ్  వేయడంతోఅభిమానులకు షాక్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: