మెగా పవర్ స్టార్ రాం చరణ్ కెరియర్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉందని చెప్పొచ్చు. ఓ పక్క రాజమౌళి డైరక్షన్ లో ఆర్.ఆర్.ఆర్ సినిమా చాలా ప్రెస్టిజియస్ గా రాబోతుంది. ఈ సినిమా తర్వాత శంకర్ డైరక్షన్ లో సినిమా కూడా భారీ అంచనాలతో వస్తుంది. దిల్ రాజు ఏమాత్రం కాంప్రమైజ్ అవకుండా చేస్తున్న ఈ సినిమాలో చాలా సర్ ప్రైజెస్ ఉంటాయని అంటున్నారు. ట్రిపు ఆర్, ఆర్సీ 15 ఈ రెండు సినిమాలతో చరణ్ పాన్ ఇండియా స్టార్ అవడం పక్కా అని చెప్పొచ్చు.

ఇక ఈ సినిమాల తర్వాత చరణ్ స్టార్ డైరక్టర్ కొరటాల శివ డైరక్షన్ లో సినిమా చేస్తాడని టాక్. ఆల్రెడీ చిరు ఆచార్య సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు చరణ్. ఆచార్యలో సిద్ధ పాత్రలో చరణ్ స్పెషల్ సర్ ప్రైజ్ చేయనున్నాడు. ఇక ఇప్పుడు సోలోగా చరణ్ తో సినిమాకు సిద్ధం అవుతున్నాడట కొరటాల శివ. ప్రస్తుతం ఆచార్య ముగించిన తర్వాత వెంటనే తారక్ తో చేస్తున్న సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు.

ఎన్.టి.ఆర్, కొరటాల శివ కాంబో సినిమా కూడా భారీ అంచనాలతో వస్తుంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రాబోతున్న ఈ సినిమాకు 200 కోట్ల దాకా బడ్జెట్ పెట్టేస్తున్నారట. తారక్ సినిమా తర్వాత చరణ్ తో మరో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నాడట కొరటాల శివ. తను చేసే సినిమాల్లో సోషల్ మెసేజ్ తో పాటుగా కమర్షియల్ అంశాలు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటాయి. కాబట్టి ఆ కథలతోనే నేషనల్ వైడ్ ఆడియెన్స్ ను మెప్పించాలని చూస్తున్నాడు. మరి కొరటాల శివ ప్రయత్నాలు ఎంతవరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి. ఎన్.టి.ఆర్, చరణ్ సినిమాల తర్వాత అల్లు అర్జున్ తో సినిమా కూడా లైన్ లో పెట్టాడు స్టార్ డైరక్టర్.


మరింత సమాచారం తెలుసుకోండి: