సినీ ఇండస్ట్రీలో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు శిష్యుడిగా సినీ రంగ ప్రవేశం చేసి తర్వాత తన తండ్రి ఇచ్చిన కథలతో వరుస సినిమాలు చేసి ఒక్క ఫ్లాప్ కూడా అందుకోకుండా సూపర్ హిట్స్ కొడుతూ వెళుతున్నాడు రాజమౌళి.ఇకపోతే బాహుబలి 1, 2 సినిమాలతో తెలుగు వాడి సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన ఆయన తాజాగా చేసిన ఆర్ఆర్ఆర్ సినిమాతో మరోసారి ఆ సత్తా చాటి చెప్పినట్లు అయింది. కాగా ఇప్పటికే థియేటర్లలో విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా దాదాపు 1130 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది.ఇప్పుడు ప్రస్తుతానికి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ దక్కుతోంది.

అయితే  ఇతర దేశాలకు చెందిన నటీనటులు, సెలబ్రిటీలు సినిమా చూసి బాగుందంటూ అభినందిస్తున్నారు. అయితే ఇక తాజాగా ఒక ఆంగ్ల మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రాజమౌళి తన సినిమాల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటె ఆర్ఆర్ఆర్ తో మంచి హిట్ కొట్టాక ఇప్పుడు, భారతీయ కథలు ప్రపంచ స్థాయిలో ప్రదర్శించబడాలని నేను కోరుకుంటున్నానని ఆయన అన్నారు.అయితే ఈ క్రమంలో వాటిని ప్రపంచం ముందుకు తీసుకు వెళ్ళే వారి లిస్టులో నేను ముందు వరుసలో ఉండాలనుకుంటున్నానని, అది నా స్వార్థం" అని రాజమౌళి అన్నారు.

కాగా  రాజమౌళి మాట్లాడుతూ బాహుబలి లాంటి అద్భుతమైన విజయం అందుకున్న తర్వాత తాను చేసే తర్వాతి సినిమా మీద ఒత్తిడి తీవ్రంగా ఉంటుందని అయితే అదృష్టవశాత్తు ఆర్ఆర్ఆర్ ఆ బౌండరీలు అన్నీ దాటేసి తనను ఒత్తిడి నుంచి తగ్గించిందని చెప్పుకొచ్చారు.ఇకపోతే ప్రస్తుతానికి రాజమౌళి మహేష్ బాబుతో చేయబోయే సినిమాకి సంబంధించిన స్టోరీ డిస్కషన్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే ఒక ఆఫ్రికా అడవుల నేపధ్యంలో సాగుతున్న కథ సిద్ధం చేశారని ప్రచారం జరుగుతోంది.ఇక  కథ మీద ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదని గతంలో మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే మొత్తం మీద రాజమౌళి తన స్వార్థం అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: