సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే హీరోయిన్లకు లైఫ్ స్పామ్ చాలా తక్కువగా ఉంటుంది. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం తమ నటనతో.. అందంతో.. అదృష్టంతో దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో అదే పొజిషన్లో కొనసాగుతున్నారు అంటే ఇక అదృష్టం వారికి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి వారిలో నయనతార తర్వాత అంతటి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సీనియర్ హీరోయిన్ త్రిష ఒకరు అని చెప్పవచ్చు. దాదాపు 20 సంవత్సరాలకుపైగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న ఈమె ఇప్పటికీ తన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది.

వరుస సినిమాలలో అవకాశాలు లేక ఇబ్బంది పడ్డ త్రిష డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమా ద్వారా మళ్ళీ ట్రాక్ లోకి వచ్చింది. అయితే తాజాగా  త్రిష రాంగీ ఈ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇప్పటికే ఈ సినిమా విడుదలకు సిద్ధం కానుంది. ఈ నేపథ్యంలో తెలుగులో విడుదలకు ఆటంకం కలుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే రెండు తెలుగు రాష్ట్రాలలో రవితేజ ధమాకా , అవతార్ 2 సినిమాలు భారీ వసూలు క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో థియేటర్లు ఖాళీగా లేవు.  అందుకే త్రిష రాంగీ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు లభించకపోవడం వల్లే సినిమాను తెలుగులో విడుదల చేయడం లేదు అని చిత్ర బృందం ప్రకటించింది.

ఈ సినిమాలో త్రిష బైక్ రైడింగ్ తో పాటు యుద్ధ విద్యల్లో కూడా ట్రైనింగ్ తీసుకుంది. రీసెంట్ గా ఉజ్బేకిస్తాన్ లో జరిగిన షూటింగ్ లో డూపు లేకుండా త్రిష పై  తెరకెక్కించిన పోరాట దృశ్యాలు ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేస్తున్నాయని. ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా,  ఖైదీగా అద్భుతంగా పెర్ఫామ్ చేసినట్టు చిత్ర యూనిట్ తెలిపింది.  మరి ఈ సినిమా తమిళంలో విడుదలై ఏ రేంజ్ లో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: