టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెలుసుకున్న నాగచైతన్య సమంత విడాకులు తీసుకుని ప్రస్తుతం ఎవరి లైఫ్ లో వారు బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు వేరువేరుగా వారి దారిలో వెబ్ సిరీస్ లు సైతం చేస్తున్నారు. వరుస సినిమాలు చేస్తున్న సమంత ఇప్పుడు సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటుంది. రెస్ట్ తర్వాత మళ్లీ తన తదుపరి సినిమాలను స్టార్ట్ చేయనుంది .అయితే గత కొన్ని నెలల క్రితం వీరిద్దరూ వేరువేరుగా వెబ్ సిరీస్ లలో నటించారు. ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ ఆ వెబ్ సిరీస్  ఏమయ్యాయి..

ఇప్పటివరకు ఎందుకు రిలీజ్ అవ్వలేదు అన్న ప్రశ్న అందరిలో నెలకొంది. చాలామందికి గుర్తుండే ఉంటుంది నాగచైతన్య విక్రమ్ కె కుమార్ కాంబినేషన్లో ఒక వెబ్ సిరీస్ వచ్చింది. దూత అనే పేరుతో వచ్చిన ఆ వెబ్ సిరీస్ హార్రర్ జోనల్లో వచ్చింది. ఇక ఈ వెబ్సైట్ చాలా నెలల క్రితమే పూర్తయిపోయింది. ఏమైందో తెలియదు కానీ ఇప్పటివరకు విడుదల మాత్రం కాలేదు. ఇక సమంత ప్రధాని పాత్రలో రాజ్ అండ్ డీకే సిరీస్ సైతం వచ్చింది.  దాని సంగతి కూడా ఇప్పటివరకు ఏమీ చెప్పడం లేదు. ఇదంతా కాకుండా విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఇంతకాలం సమయం తీసుకుంటున్నారా అంటే అది కూడా కాదు.

దీంతో వీరిద్దరి వెబ్ సిరీస్ ఏమైంది అన్న ప్రశ్న అందరిలో స్టార్ట్ అయింది. దూత వెబ్ సిరీస్ గురించి చర్చించుకోవడం స్టార్ట్ అయ్యి ఏడాది దాటిపోయింది. గత ఏడాది దసరాకు ఈ సిరీస్ ను తీస్తామని ప్రకటించారు. ఆ దసరా వెళ్ళిపోయి ఈ దసరా కూడా వచ్చేసింది. ప్రియాంక చోప్రా సితడెల్ కాస్త తేడా కొట్టడంతో ఇండియన్ సిటాడెల్ డిలే చేస్తున్నారేమో అన్న వార్తలు కూడా వినబడుతున్నాయి. వాటన్నిటికీ మించి ఈ రెండు సిరీస్ లో నిర్మించిన అమెజాన్ ప్రైమ్ ఆలోచన కూడా మారిపోయిందా అన్న సందేహాలు కూడా వినబడుతున్నాయి. ఇప్పుడు సీరియస్ లకి పెద్దగా ఆదరణ లేదు కాబట్టి ఈ సిరీస్ లను డిలే చేస్తున్నారు అన్న కామెంట్లు  వినబడుతున్నాయి. ఈ కారణంగానే కొన్నాళ్లపాటు ఆ సీరియస్లను హోల్డ్ చేసే ఆలోచనలు ఉన్నట్లుగా కూడా సమాచారం వినబడుతోంది. చూద్దాం ఈ సిరీస్  ఎప్పుడు రిలీజ్ అవుతాయో..!!

మరింత సమాచారం తెలుసుకోండి: