పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతికృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. హరిహర వీరమల్లు మూవీ జూన్ నెల 13వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. ఏఎం రత్నం త్వరలో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కానుందని తెలుస్తోంది. హరిహర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
 
దాదాపుగా 300 కోట్ల రూపాయలకు పైగా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఎన్నో ప్రత్యేకతలతో, యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. ఈ సినిమాకు ఇప్పటికే రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ సాధించడం పవన్ కళ్యాణ్ కు సైతం కీలకం అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సొంతమయ్యాయి.
 
హరిహర వీరమల్లు మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. హరిహర వీరమల్లు సినిమాలో ట్విస్టులు సైతం ఆసక్తికరంగా ఉండనున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ ఎంట్రీ సీన్ అదిరిపోతుందని సమాచారం అందుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
 
హరిహర వీరమల్లు సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుండగా ఈ సినిమా కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. హరిహర వీరమల్లు సినిమా టాలీవుడ్ రేంజ్ ను పెంచే సినిమా అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ హీరో రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలో ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఓకే చెప్పిన సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు.


 


మరింత సమాచారం తెలుసుకోండి: