
ఇప్పటికే నాగచైతన్య తానేంటో ప్రూఫ్ చేసుకున్నాడు. అఖిల్ కెరీర్ అంతంత మాత్రంగానే సాగుతోంది. సరైన బ్రేక్ కోసం అయ్యగారు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆ సంగతి పక్కన పెడితే తండ్రీ కొడుకులైనా నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ముగ్గురితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్ ఎవరు తెలుసా..? ఆ లక్కీ ఛాన్స్ ఇప్పటివరకు కేవలం ఒక్క హీరోయిన్ కు మాత్రమే దక్కింది. ఇంతకీ ఆ లక్కీ బ్యూటీ మరెవరో కాదు పూజా హెగ్డే.
మొదటిగా పూజా హెగ్డే నాగచైతన్య తో కలిసి నటించింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం `ఒక లైలా కోసం`. ఈ సినిమా యావరేజ్ గా ఆడినప్పటికీ.. చైతూ-పూజా జంటకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` మూవీలో అఖిల్ కు జోడిగా పూజా హెగ్డే నటించింది. రొమాంటిక్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ చిత్రం హిట్ గా నిలిచింది. ఇక నాగార్జునతో సినిమా చేయకపోయినప్పటికీ మాజా యాడ్ లో కలిసి యాక్ట్ చేసింది. ఆ విధంగా తండ్రి కొడుకులైనా ముగ్గురు అక్కినేని హీరోలతో నటించిన ఏకైక హీరోయిన్గా నిలిచింది పూజా హెగ్డే.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు