
ఈమె హీరోయిన్ కి మించిన అందంగా ఉంటుంది . మంచి టాలెంటెడ్ . ఈమె ఎవరో కాదు ఒకప్పుడు ఇండస్ట్రీని తన అంద చందాలతో అల్లాడించేసిన జుహీ చావ్లా కూతురు . కోట్లల్లో ఆస్తి .. ఇండస్ట్రీలో పెద్దపెద్ద వారితో పరిచయాలు.. కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కింగ్ గా పేరు సంపాదించుకున్న షారుక్ ఖాన్ తో జాన్ జిగిడి సంబంధమే ఉంది. కానీ సినిమాలకు మాత్రం దూరంగా ఉంటుంది . జాన్వి మెహత కి కుటుంబం నుంచి వచ్చిన ఆస్తి ఆమె సంపాదించిన ఆస్తి మొత్తంగా 4200 కోట్లకు పైగానే ఉంటుంది .
కానీ ఆమె మాత్రం సింపుల్ గా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటుంది. ఆమె బిజినెస్ ..స్పోర్ట్స్ రంగాలలో దూసుకు వెళ్తుంది. జాన్వి మెహతా 2023లో కొలంబియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకుంది . అయితే ఆ తర్వాత అందరి స్టార్స్ పిల్లల లా సినిమాలోకి రావాలి అంటూ మోడలింగ్ అంటూ ఎక్స్పోజింగ్ అంటూ తన టైం వేస్ట్ చేసుకోలేదు .. తనకంటూ ఒక ప్రత్యేకమైన దారిని ఎంచుకుంది . చిన్నప్పటినుంచి బిజినెస్ అంటే చాలా ఇష్టం . అందుకే అదే రంగంలో స్థిరపడాలి అంటూ ట్రై చేసింది. అలాగే స్థిరపడింది.
ఇప్పుడు ఫ్యామిలీ బిజినెస్ లు చూసుకుంటూ చక్కగా లైఫ్ని ముందుకు తీసుకెళ్తుంది . జాన్వి మొదటిసారిగా ఐపిఎల్ 2022 వేలం పాటలో అందరి దృష్టిని ఆకర్షించింది. షారుక్ ఖాన్ పిల్లలు ఆర్యన్ , సుహానలతో కలిసి కోల్కత్తా నైట్ రైడర్స్ అకేషనల్ టేబుల్ పై సందడి చేసింది . ఎప్పుడైతే ఐపీఎల్ వేలం పాటలో కనిపించిందో జాన్వి అప్పటినుంచి అందరూ ఐపీఎల్ గర్ల్ అంటూ పిలవడం ప్రారంభించారు . సోషల్ మీడియా మొత్తం ఆమె పేరు అలానే మారుమ్రోగిపోతూ ఉంటుంది . అమెరికా, కెనడా ,ఉగాండా, కెన్యా వంటి దేశాలలో మెహతా గ్రూప్ లో వీరికి భారీగా వాటాలు ఉన్నాయి . అందుతున్న సమాచారం ప్రకారం జూహీ చావ్లా ఆస్తి 4600 కోట్లు మెహతా గ్రూప్ ఆస్తులు 500 మిలియన్ల డాలర్లకు పైగా సుమారు 4215 కోట్లు ఉంటుందని అంచనా..!