అనిల్ రావిపూడి.. కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాదు..పాన్ ఇండియా రేంజ్ లో ఈ డైరెక్టర్ పేరు మారుమ్రోగిపోతుంది . దానికి కారణం ఆయన తెరకెక్కించిన "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా అని చెప్పుకోక తప్పదు. చాలా సింపుల్ గా చాలా చాలా క్లీన్ లైన్ అప్ తో ఫ్యామిలీ అంతా కూడా కలిసి కూర్చొని నవ్వుతూ ఎంజాయ్ చేసే విధంగా ఈ సినిమాని తెరకెక్కించారు మూవీ మేకర్స్. సినిమా రిలీజ్ అయ్యి సంవత్సరం దాటిపోతుంది కానీ సినిమా పవర్ మాత్రం తగ్గలేదు . సినిమా కామెడీ పవర్ ఇంకా జనాలను ఎంటర్టైన్ చేస్తుంది . మరీ ముఖ్యంగా సినిమాలోని పాటలు కూడా హైలెట్గా మారాయి.  అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్ అదిరిపోయింది.


ఒకరు కాదు ఇద్దరు కాదు సినిమా చూసిన ప్రతి ఒక్కరు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరు కూడా కడుపుబ్బనవ్వుకున్నారు అంటూ బాగా అనిల్ రావిపూడి అని పేశంసించేశారు. కాగా ప్రెసెంట్ మెగాస్టార్ చిరంజీవి ని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నాడు . అనిల్ రావిపూడి ఈ సినిమా షూటింగ్ కేరళలో జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈసారి కూడా ఈ సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి పక్కాగా ప్లాన్ చేసి ముందుకు వెళ్తున్నారు.  ఈ సినిమాలో నయనతార ని  హీరోయిన్ గా చూస్ చేసుకున్నాడు అనిల్ రావిపూడి.



కాగా ఈ సినిమా మరొక ఆరు నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకోబోతుంది. అయితే అనిల్ రావిపూడి ఎక్కువగా టైం వేస్ట్ చేయడానికి ఇష్టపడరు .ఈ సినిమాని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి పక్క ప్లాన్ తో ముందుకు వెళ్తున్నాడు అనిల్ రావిపూడి . ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వెంటనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకురాబోతున్నారట . అయితే ఈసారి అనిల్ రావిపూడి ఏ హీరోతో వర్క్ చేయబోతున్నారు..? ఏ హీరోని  తన వర్షెన్ లో చూపించబోతున్నాడు అనే క్యూరియాసిటీ అందరికీ ఉంది .



అందుతున్న  సమాచారం ప్రకారం ఈసారి ఆయన టార్గెట్ అక్కినేని నాగార్జున అంటూ తెలుస్తుంది.  బాలకృష్ణ - చిరంజీవి - వెంకటేష్ అందరు సీనియర్ హీరోలతో సినిమాను తెరకెక్కించేశారు . నాగార్జున తో అనిల్ రావిపూడి అంటే మాత్రం నో డౌట్ అది క్రేజీ హిట్ అవ్వడం కన్ఫామ్ అంటున్నారు అభిమానులు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి: