జాన్వీ కపూర్.. ఈ అమ్మ‌డు అటు నార్త్ తో పాటు ఇటు సౌత్ లోనూ స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల‌ను పలకరిస్తోంది. `దేవర` తో టాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ క‌పూర్‌.. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి జోడిగా `పెద్ది` చిత్రంలో నటిస్తోంది. మరోవైపు `పరమ సుందరి` మూవీతో తాజాగా నార్త్ ప్రేక్షకులకు హాయ్ చెప్పింది. సిద్ధార్థ్‌ మల్హోత్రా, జాన్వీ జంటగా నటించిన ఈ రొమాంటిక్ డ్రామా ఆగస్టు 29 విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.


ప్రొఫెషన్ గురించి పక్కన పెడితే.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి జాన్వీ కపూర్ ఆసక్తికర సంగతులు బయటపెట్టింది. సాధారణంగా సెలబ్రిటీలే కాదు సామాన్యులు కూడా ఈ మధ్యకాలంలో పెళ్లి తర్వాత ఒకరు లేదా ఇద్దరు పిల్లలు చాలనుకుంటున్నారు. అంతకుమించి కానేందుకు ఎవ్వ‌రూ ఆసక్తి చూపడం లేదు. కానీ జాన్వీ మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. ఈ బ్యూటీ పెళ్లికి ముందే పిల్లల గురించి ప్లానింగ్ చేసేసింది. ఒక‌రు కాదు ఇద్దరు కాదు ముగ్గురు పిల్లలు కావాలంటుంది.


పరమ సుందరి ప్రమోషన్ ఇంటర్వ్యూలో జాన్వీ పిల్ల‌ల గురించి మాట్లాడుతూ.. `నేను వివాహం తర్వాత ముగ్గురు పిల్లలను కనాల‌ని అనుకుంటున్నాను. మూడు నా ల‌క్కీ నెంబర్. అంతే కాదు నా పిల్లల్లో ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు మూడో బిడ్డ వాళ్ళలో ఒకరికి సపోర్ట్ గా ఉంటారు. సందర్భాలు బట్టి ఆ మ‌ద్ద‌తు మారుతూ ఉంటుంది. త‌ద్వారా నా బిడ్డలకు మంచి తోడు, మ‌ద్ద‌తు దొరుకుతుంది` అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైర‌ల్ గా మారాయి. కాగా, జాన్వీ క‌పూర్ గ‌త కొన్నేళ్ల నుంచి శిఖర్ పహారియాతో రిలేష‌న్‌లో ఉంది. వీరి వివాహానికి ఇరుకుటుంబ స‌భ్యుల నుంచి పాజిటివ్ సిగ్న‌ల్స్ వ‌చ్చిన‌ట్లు కూడా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: