
ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా, సీనియర్ నటి టబు ఒక కీలక పాత్ర లో కనిపించనున్నారు. పూరి సినిమాల్లో పాత్రలు ఎంత పవర్ఫుల్గా ఉంటాయో అందరికీ తెలిసిందే. అందుకే ఈసారి టబు పాత్ర కూడా సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ కానుంది. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు మంచి క్రేజ్ సాధించగా, ఈసారి విజయ్ సేతుపతి అడ్డాగా రావడంతో ప్రాజెక్ట్ రేంజ్ మరింత పెరిగింది. షూటింగ్ ఇప్పటికే శరవేగంగా సాగుతోంది. త్వరలోనే పూర్తి చేసుకుని, వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పూరి – విజయ్ సేతుపతి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా టైటిల్ టీజర్ విడుదలకు కౌంట్డౌన్ స్టార్ట్ అయ్యింది. సెప్టెంబర్ 28న రానున్న అప్డేట్తో ఈ ప్రాజెక్ట్పై మరింత బజ్ క్రియేట్ అవడం ఖాయం.