దేవిశ్రీప్రసాద్ తన సినిమాలకు సంబంధించి ఇచ్చే ట్యూన్స్ లో అతడి సత్తా అయిపోయింది అని విమర్శలు వస్తున్న నేపధ్యంలో ‘మహర్షి’ మూవీ గురించి చాల కష్టపడ్డాడు అన్న వార్తలు వచ్చాయి. దీనికి బలం చేకూరుస్తూ నిన్న ఉదయం విడుదలైన ‘మహర్షి’ మూవీలోని మొదటి పాట ‘చోటే చోటే బాతిన్’ అందరికీ బాగా నచ్చినా దేవిశ్రీకి విమర్శలు తప్పడం లేదు. 

దీనితో ఇతడిని టార్గెట్ చేస్తూ విపరీతమైన కామెంట్స్ వస్తున్నాయి. ఈ పాటను స్వయంగా దేవిశ్రీప్రసాద్ పాడటం మహేష్ అభిమానులకు కూడ నచ్చలేదు అని వార్తలు
వస్తున్నాయి. అంతేకాదు మంచి ట్యూన్‌ ను దేవిశ్రీ తన గానంతో చెడగొట్టాడు అంటూ సెటైర్లు వేస్తున్నారు. 

వాస్తవానికి దేవిశ్రీకి ఎప్పుడు గాయకుడుగా అంత మంచి పేరులేదు. అయితే గాయకుడుగా కూడ రాణించాలని అతడి కోరిక. ఈ కోరికతోనే గత సంవత్సరం ‘రంగస్ఘలం’ సినిమాలో జానపద గాయకుడు శివ నాగులు పాడిన వెర్షన్‌కు మంచి స్పందన వచ్చినా దానిని పక్కకు పెట్టి తాను పాడిన పాటను ‘రంగస్థలం’ మూవీలో పెట్టి తీవ్ర విమర్శలకు లోనయ్యాడు. 

అయితే ఈ విషయాన్ని అప్పుడే మర్చిపోయి దేవిశ్రీ మళ్ళీ ‘మహర్షి’ సినిమాలో ఈ ప్రయోగం చేయడంతో ఈపాట పై విమర్శలు రావడమే కాకుండా ఈపాటను అతడు కాకుండా మరెవ్వరైనా ప్రముఖ సింగర్ పాడి ఉంటే ఈపాట సూపర్ హిట్ అయి ఉండేది కదా అంటూ మహేష్ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. అంతేకాదు ‘మహర్షి’ సినిమాలో దేవిశ్రీ ఇలా ఇంకా ఎన్ని పాటలు పాడాడో తెలియక అభిమానులు ఖంగారు పడుతున్నారు. ఏమైనా పాట హిట్ అయి కూడ దేవిశ్రీకి విమర్శలు రావడం బ్యాడ్ లక్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: