అయితే ఎన్నోసార్లు మరణానికి ఎదురెళ్లి మృత్యుంజయుడు గా తిరిగి వచ్చారు బిపిన్ రావత్. ఇలా భారత ఆర్మీలో మరణాన్ని ఎదిరించినా వీరుడిగా ఎంతగానో గుర్తింపు సంపాదించారు. అయితే ఇటీవల జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ తో పాటు ఆయన సతీమణి కూడా ఉండటం గమనార్హం. అంతేకాదు ఆర్మీకి చెందిన పలువురు కీలకమైన కమాండర్లు కూడా ఈ ప్రమాదంలో మరణించారు. ఇదిలా ఉంటే దాదాపు ఆరేళ్ల కిందట బిపిన్ రావత్ ఒక ప్రమాదం నుంచి బయటపడి మృత్యుంజయుడు గా మారిపోయాడు. కానీ ఇప్పుడు అలాంటి ప్రమాదంలో మరణించారు.
2015 ఫిబ్రవరి మూడవ తేదీన లెఫ్టినెంట్ జనరల్ గా పనిచేస్తున్నారు బిపిన్ రావత్.. ఈక్రమంలోనే నాగాలాండ్ దిమాపూర్ జిల్లాలోని హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరారు. అయితే చీతా హెలికాప్టర్ లో బయలుదేరిన సమయంలో ఆయనతో పాటు మరో ఇద్దరు సిబ్బంది మాత్రమే ఉన్నారు.. సరిగ్గా హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొన్ని సెకన్ల సమయంలోనే హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో హెలికాప్టర్ కొంత ఎత్తుకు వెళ్లగానే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలిక్యాప్టర్ మొత్తం తునాతునకలు అయిపోయింది. అయితే ఈ ప్రమాదం నుంచి బిపిన్ రావత్ తో పాటు సిబ్బంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు.. అప్పటి ప్రమాదంలో మృత్యుంజయుడు గా నిలిచిన బిపిన్ రావత్ ఇక ఇటీవల జరిగిన ప్రమాదంలో మాత్రం ప్రాణాలు కోల్పోయారు.