కాగా సామాన్య ప్రజల్లో కోవిడ్ పూర్తిగా అంతరించినట్టేనన్న భావం పెరగడం, కనీసం మాస్క్లు కూడా పెట్టుకోకుండా తిరగడం, పర్యాటక ప్రాంతాల్లో తగిన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతోనే కోవిడ్ మరోసారి పంజా విసురుతోందని అధికార వర్గాలు చెపుతున్నాయి. కేసుల ఉధృతి ఇలాగే కొనసాగితే ముంబయితో సహా మరికొన్ని నగరాల్లోనూ మళ్లీ లాక్డౌన్ తరహా ఆంక్షలు తప్పవని, అదే జరిగితే ఇప్పటికే ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన పలు రంగాలు కోలుకోలేని పరిస్థితికి దారితీయవచ్చన్న భయాందోళనలు పెరుగుతున్నాయి. అయితే కోవిడ్ రెండోవేవ్ నాటితో పోలిస్తే దేశంలో ఇప్పుడు వ్యాక్సినేషన్ అయినవారి సంఖ్య ఎన్నోరెట్లు అధికం కావడంతో అంతటి ముప్పు ఉండకపోవచ్చని నిపుణులంటూ ఉండగా, ప్రమాదాన్ని తక్కువగా అంచనా వేయకూడదని ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటేనే ముప్పునుంచి బయటపడే అవకాశం ఉంటుందని మరికొందరు అంటున్నారు. ఇక కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నివారణకు వ్యాక్సిన్లు ఏమేరకు పనిచేస్తాయోననే పరిశీలన ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే దీనికారణంగా మరణాల శాతం పెద్దగా ఉండకపోవచ్చన్న విశ్లేషణలు కాస్త ఊరట కలిగిస్తున్నాయి.
కాగా సామాన్య ప్రజల్లో కోవిడ్ పూర్తిగా అంతరించినట్టేనన్న భావం పెరగడం, కనీసం మాస్క్లు కూడా పెట్టుకోకుండా తిరగడం, పర్యాటక ప్రాంతాల్లో తగిన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతోనే కోవిడ్ మరోసారి పంజా విసురుతోందని అధికార వర్గాలు చెపుతున్నాయి. కేసుల ఉధృతి ఇలాగే కొనసాగితే ముంబయితో సహా మరికొన్ని నగరాల్లోనూ మళ్లీ లాక్డౌన్ తరహా ఆంక్షలు తప్పవని, అదే జరిగితే ఇప్పటికే ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన పలు రంగాలు కోలుకోలేని పరిస్థితికి దారితీయవచ్చన్న భయాందోళనలు పెరుగుతున్నాయి. అయితే కోవిడ్ రెండోవేవ్ నాటితో పోలిస్తే దేశంలో ఇప్పుడు వ్యాక్సినేషన్ అయినవారి సంఖ్య ఎన్నోరెట్లు అధికం కావడంతో అంతటి ముప్పు ఉండకపోవచ్చని నిపుణులంటూ ఉండగా, ప్రమాదాన్ని తక్కువగా అంచనా వేయకూడదని ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటేనే ముప్పునుంచి బయటపడే అవకాశం ఉంటుందని మరికొందరు అంటున్నారు. ఇక కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నివారణకు వ్యాక్సిన్లు ఏమేరకు పనిచేస్తాయోననే పరిశీలన ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే దీనికారణంగా మరణాల శాతం పెద్దగా ఉండకపోవచ్చన్న విశ్లేషణలు కాస్త ఊరట కలిగిస్తున్నాయి.