ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందొ టీడీపీ నేతల పరిస్థితి అంతే ఘోరంగా ఉంది. తెల్లవారితే ఎప్పుడు ఏవమవుతుందో తెలీక తెగ భయపడిపోతున్నారు. రాష్ట్రంలోని అందరు టీడీపీ నేతలు, వైసీపీ నేతలు ఎంతో హాయిగా ఉంటున్నారు కానీ విశాఖ లోని టీడీపీ నేతలు మాత్రం ఈరోజు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో తెలీక దినదినగండంగా గడుపుతున్నారు.. వైసీపీ అధికారంలోకి రావడం పై వారికి ఏమాత్రం అభిప్రాయ తేడాలు లేవు.. ఎందుకంటే ఒకరోజు ఒక పార్టీ లొ ఉంటుంది, ఇంకో రోజు ఇంకో పార్టీ అధికారంలో ఉంటుంది.. అయితే వీరి పరిస్థితి ఎలా ఉందంటే కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లు ఉంది.. అమరావతి నుంచి రాజధాని ని విశాఖ కు మార్చిన సంగతి తెలిసిందే..