రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా తయారయింది.. తెలంగాణ లో బీజేపీ పార్టీ కాంగ్రెస్ నాశనానికి కారణమైతే ఏపీ లో వైసీపీ పార్టీ అందుకు ఆజ్యం పోసింది.. అయినా కూడా కాంగ్రెస్ చెప్పే మాటలు చూస్తుంటే తొందరలోనే అధికారంలోకి వచ్చేలా ఉన్నట్లు అనిపిస్తుంది. తెలంగాణాలో గట్టిగా 20 సీట్లు కొట్టలేని పార్టీ సైతం తమ గొంతు చించుకు అరవడం తెలంగాణ ప్రజలకు హాస్యాస్పదం అనిపిస్తుంది. గత ఎన్నికల్లో టీ ఆరేస్ పార్టీ గట్టి పోటీ ఇస్తుందనుకున్నా కాంగ్రెస్ పార్టీ తేలిపోయింది. దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఎవరు పట్టించుకోలేదు.