రాజకీయాలు చేయాలనీ ఎవరికైనా ఉంటుంది.. ఇది ఓ వర్గం వారికి, ఓ వయసు వారికి, ఓ కులం వారికి అన్న తేడా ఏం లేదు.. ప్రజల ఆదరణను బట్టి ఓ మాములు మనిషి నాయకుడవుతాడు.. ఆ నాయకుడి కి సరైన పార్టీ దొరికితే ఆయనకు ఇంకా తిరుగుండదు.. రాజకీయ నాయకుడు ప్రజల్లో ఎక్కువగా ఉంటే చాలు ఏ పార్టీ అయినా పిలిమరీ సీటిస్తుంది.. అయితే ఎస్సీ వర్గం రాజకీయ నాయకుల విషయంలో కొంత ఆందోళన చెందుతున్నారు ప్రజలు.. ఏ పార్టీ లో ఉన్నా, ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ వర్గం రాజకీయ నాయకులూ తేలిపోతున్నారు.. ఎందుకో తెలీదు కానీ ముఖ్యంగా ఏపీ లో ఈ ఎస్సీ వర్గం నాయకులూ కొన్ని రోజులకే రాజకీయాలకు పరిమితమై ఆ తరువాత కనుమరుగైపోతున్నారు.