భారతదేశంలో రాజకీయాలను పురుడు పోసుకున్న పార్టీ కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడెలా తయారైందో అందరికి తెలిసిందే..ఇప్పటికే పార్టీ లో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు స్పష్టం గా తెలిశాయి.. పార్టీ లోని సీనియర్ నేతలకు, కొత్త తరం నేతలకు అస్సలు పడడం లేదని అర్థమవుతుంది.. రాష్ట్ర స్థాయిలోనే అనుకుంటే కేంద్ర స్థాయిలోనూ పార్టీ నేతలమధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇదిలా ఉంటె ఏపీ లో మళ్ళీ పాగా వేయడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది.. ఇప్పటికే గత రెండు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక్క సీటు కూడా గెల్చుకోలేదు.. ఇప్పుడు వచ్చే ఎన్నికల నాటికైనా కొంతైనా బలపడాలని చూస్తున్నారు..