తెలంగాణ రాష్ట్రంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న కేసీఆర్ కి దుబ్బాక ఉప ఎన్నిక లో బీజేపీ పార్టీ పెద్ద బ్రేక్ వేసింది.. అవలీలగా గెలిచేస్తామని అనుకున్న టీ ఆర్ ఎస్ పార్టీ మట్టి కరిపించి తమ బలం ఏంటో చూపించారు బీజేపీ పార్టీ నేతలు.. నిజానికి దుబ్బాక లో ఉన్న పరిస్థితులు వేరు అక్కడ టీ ఆర్ ఎస్ వైఫల్యం అనేకంటే బీజేపీ పార్టీ అభ్యర్థి పై సింపతీ తోనే వారు గెలిచారు అని చెప్పొచ్చు..వరుసగా రెండు సార్లు ఓడిపోయినా రఘునందన్ రెడ్డి మూడో సారి కూడా పోటీ చేయడంతో ఆయనకు సింపతీ కూడా వర్క్ అవుట్ అయ్యి పార్టీ ని గెలిపించేలా చేశాడని చెప్పొచ్చు..