రేవంత్ రెడ్డి మంచి నాయకుడే అయినా సరైన పార్టీ లో లేనందున అయన గొప్పతనం ఎవరికీ తెలియట్లేదని అనేవారు రాష్ట్రంలో ఎక్కువయ్యారు.. తొలుత బీజేపీ నుంచి అయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఆ తర్వాత టీడీపీ లోకి వెళ్లి ఇప్పుడు కాంగ్రెస్ లో ఎంపీ గా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ కు వచ్చిన దగ్గరినుంచి అయన పరిస్థితి ఒంటరి గా అయిపోయాడని పరిస్థితులు చూస్తే చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ లో అంత యాక్టివ్ గా ఎవరు లేకపోయినా రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ ని అందరికంటే ఎక్కువ గా విమర్శించడం అంతటా చర్చనీయాంశమైంది.. కేసీఆర్ ని విమర్శించాలంటే అది ఒక్క రేవంత్ రెడ్డి కె సాధ్య అన్నట్లు తయారైంది పరిస్థితి..