ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి బదిలీపై సిక్కిం హైకోర్టు సీజేగా వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు అమరావతిలో ఘనంగా వీడ్కోలు పలికారు. జస్టిస్ మహేశ్వరికి రాజధాని రైతులు, మహిళలు వీడ్కోలు చెప్పారు. ఆయన వాహనం ప్రయాణించినంత మేర రోడ్డుపై పువ్వులు పరిచి, రోడ్డుకిరువైపులా నిలబడి తమ అభిమానం ప్రదర్శించారు. ట్రాక్టర్ల నిండా పువ్వులు తీసుకువచ్చిన రైతులు కిలోమీటర్ల మేర రోడ్డుపై చల్లారు.