ఫైర్ బ్రాండ్ రాజకీయనేత జేసీ దివాకర్ రెడ్డి ఇవాళ పోలీసులపై ఆగ్రహంతో ఊగిపోయారు. తనపై నమోదు చేసిన అట్రాసిటీ కేసును తొలగించేంత వరకు ఆమరణ దీక్ష చేపడతానని జేసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, జూటూరు ఫాంహౌస్ లో ఉన్న జేసీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లారు. ఓ కానిస్టేబుల్ ఆయన బెడ్రూంలో ప్రవేశించడంతో గొడవ మొదలైంది.