ఊపిరితిత్తుల్లో మంటతో బాధపడుతున్న సీఎం కేసీఆర్ ఇవాళ సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించుకున్నారు. అక్కడి వైద్యులు సీఎం కేసీఆర్ కు అవసరమైన వైద్యపరీక్షలు నిర్వహించారు. కొద్దిసేపటిక్రితమే వైద్య పరీక్షలు ముగియడంతో కేసీఆర్ ప్రగతిభవన్ కు తిరుగుపయనమయ్యారు. ఈ నేపథ్యంలో సీఎం వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు మీడియాకు వివరాలు తెలిపారు.