దేశ రాజధాని ఢిల్లీ లో రైతుల ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎముకలు కొరికే చలిలో సైతం రైతులు ప్రాణాలకు లెక్క చేయకుండా రైతుల ప్రయోజనం కొరకు పోరాడుతూనే ఉన్నారు. ఇటీవలే దేశ ప్రధాని మోడీ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకి వ్యతిరేకంగా పంజాబీ, బిహారి రైతులు ఢిల్లీ లో నడిరోడ్డుపై బైఠాయించి ఉద్యమం చేపట్టారు. అయితే మధ్య మధ్య లో ప్రభుత్వం రైతులతో చర్చలకు దిగినా ఎవరు కూడా ప్రభుత్వం చెప్పేది వినలేదు..