స్థానిక ఎన్నికల నిర్వహణపై గత కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి మధ్య నెలకొన్న వివాదం సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ వ్యవహారం సుప్రీమ్ కోర్టు దాకా చేరుకుంది. స్థానిక ఎన్నికలు త్వరగా పూర్తి చేసి పాలనను నెలకొల్పాలన్న ఉద్దేశ్యంతో నిమ్మగడ్డ రమేష్ త్వరగా ఎన్నికలు నిర్వహించాలని చూడగా బలం తక్కువగా ఉందని వైసీపీ ప్రభుత్వం ఆ ఎన్నికలను పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చింది.. అయితే నిమ్మగడ్డ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే పనికాదని తానే ఎవరికీ చెప్ప కుండా ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేశాడు..