ఏపీ లో వైసీపీ పార్టీ బలం తగ్గిపోతుండడం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది జగన్ కు ముందే తెలిసిన పైకి మాత్రం సుపరిపాలన, సంక్షేమ పాలనా అంటూ కల్లబొల్లి మాటలు చెప్తుంటారు. ఓ వైపు టీడీపీ వైసీపీ ని మట్టుబెట్టాలని చూస్తుంది.. మరోవైపు బీజేపీ కూడా ఉప్పెన దూసుకువస్తుంది.. ఈ నేపథ్యంలో జగన్ వీరిని నిలువరించాలంటే ప్రభుత్వంపైనే కాదు పార్టీ మీద కూడా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ప్రభుత్వం పై దృష్టి పెట్టి పార్టీ ని గాలికొదిలేస్తే రేపు జరగబోయే ఎలక్షన్స్ లో పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆయనకు కేంద్రం నుంచి మద్దతు ఉందో లేదో ఆయనకే అర్ధం కాని పరిస్థితి ఉంది అనే మాట వాస్తవం.