ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రకటనతో చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి అనే విషయం తెలిసిందే. యుద్ధానికి సిద్ధం అంటూ చైనా అధ్యక్షుడు ప్రకటించడంతో అటు భారతదేశం అప్రమత్తమైంది అయితే కేవలం తమ దేశ సైన్యాన్ని సంతృప్తి పరచడానికి మాత్రమే అలా జిన్ పింగ్ ప్రకటన చేశాడు అని భారత సైన్యం ఓ వైపు నుంచి భావిస్తున్నప్పటికీ మరోవైపు మాత్రం ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది అన్న విషయం తెలిసిందే. అయితే చైనాతో యుద్ధానికి ఏ క్షణంలోనైనా భారత్ సిద్ధంగా ఉందని ఇప్పటికే త్రివిధ దళాలు చెబుతున్నాయి.



 ఇక భారత అమ్ములపొదిలో ఎంతో శక్తివంతమైన యుద్ధ విమానం గా ఉన్న రఫెల్ కూడా యుద్ధానికి సిద్ధంగా ఉంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో ఏ  క్షణంలో యుద్ధం తలెత్తిన కూడా చైనాను మట్టికరిపించేందుకు భారత్ ప్రస్తుతం సరిహద్దుల్లో  ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ప్రపంచ దేశాల నుంచి వివిధ రకాల రక్షణ ఆయుధాలను సరిహద్దుల్లో తరలిస్తుంది భారత ఆర్మీ. అదే సమయంలో ఇటీవలే జిన్పింగ్ ప్రకటన నేపథ్యంలో భారత ఆర్మీ లోని సూపర్ హీరోస్ ని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.



 ఇటీవలే సూపర్ హీరోస్ గా పిలవబడే ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్ రంగంలోకి దిగేందుకు సిద్ధం అయింది. ప్రతి లక్ష మంది భారతీయులకు ఒకరు చొప్పున ఎంపిక చేయబడి నటువంటి వీళ్లు.. టాప్ ఫైట్ స్కిల్స్ ఉన్నటువంటి ఎలైట్ కమాండోలు. మౌంటెన్ వార్ ఫెర్ లో అలస్కా ఇండియాలో కఠిన  శిక్షణ పొందినటువంటి వీరికి అమెరికన్ గ్రీన్ బ్యారెట్స్ వాడే అత్యాధునిక ఆయుధాలను అందించారు. కంటికి కనిపించనంత వేగంగా గెరిల్లా దాడులు చేయడంలో వీరు శిక్షణ తీసుకున్నారు.  అయితే ఈ సూపర్ హీరోస్ ని ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దు లోకి తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: