విమానంలో ప్రయాణించే వాళ్ళకి ఒక విధంగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇక మీదట మీరు విమానాల్లో ప్రయాణిస్తే మీరు కొంత డబ్బులు ఆదా చేసినట్లే. అది ఎలా అంటే విమానాల్లో ప్రయాణించే వాళ్ళకి లగేజ్ లేకపోతే ఇకమీదట ధరల్లో రాయితీ ఇవ్వనున్నట్లు  పౌర విమానయాన శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై చెక్‌ ఇన్‌ లగేజ్‌ లేకుండా కేవలం క్యాబిన్‌ బ్యాగులతో మాత్రమే ప్రయాణించే వారికి ఇక మీదట టికెట్లపై డిస్కౌంట్లు కల్పించనున్నారు. ఈ మేరకు దేశీయ విమాన సంస్థలకు డీజీసీఏ శుక్రవారం అంటే ఫిబ్రవరి 26 వ తేదీన  దీనికి సంబందించిన  ఉత్తర్వులు కూడా  జారీ చేసింది.


ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం  విమాన ప్రయాణికులు 7 కిలోల వరకు క్యాబిన్‌ బ్యాగేజ్‌, 15 కిలోల వరకు చెక్‌ ఇన్‌ లగేజ్‌లను తీసుకెళ్లవచ్చు. అంతకంటే ఎక్కువ లగేజ్‌ తీసుకెళ్లాలనుకునే వారికి అదనపు ఛార్జీలు విధిస్తున్నారు. అయితే ఇప్పుడు  కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై చెక్‌ ఇన్‌ బ్యాగ్‌లు లేకుండా కేవలం క్యాబిన్‌ బ్యాగులతో మాత్రమే ప్రయాణించే వారికి విమానయాన సంస్థలు టికెట్ల ధరలో డిస్కౌంట్ ఇస్తారన్నమాట.


అయితే ఈ డిస్కౌంట్లు పొందాలంటే  ప్రయాణికులు టికెట్‌ బుక్‌ చేసుకునే సమయంలోనే తమ వెంట తీసుకెళ్లే బ్యాగ్ యొక్క బరువును ముందుగా చెప్పాల్సి ఉంటుంది. ‘ఎయిర్‌ లైన్‌ బ్యాగేజీ పాలసీ ప్రకారం.. ప్రయాణికులు టికెట్‌ బుక్‌ చేసుకునే సమయంలోనే  తప్పకుండా ఈ టికెట్‌ ధరలకు సంబంధించిన  స్కీం గురించి  వివరాలు వారికి తెలియ జేయాలి.అలాగే వారికీ చెప్పిన తరువాత ఆ స్కీమ్స్ వివరాలను  తప్పనిసరిగా టికెట్‌పై ప్రింట్‌ చేయాలి’ అని డీజీసీఏ  ఒక నివేదికలో పేర్కొంది.ఒక విధంగా చెప్పాలంటే ఇది విమాన ప్రయాణికులకు శుభవార్త అనే చెప్పాలి. ! మరి ఈ అవకాశాన్ని అందరు ఉపయోగించుకోండి.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: