వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు తన సొంత పార్టీ అధినేతపైనే ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. అరెస్ట్ కాక ముందు రాజధాని రచ్చబండ అంటూ ప్రతి రోజు మీడియా ముందుకు వచ్చి సీఎం జగన్ మోహన్ రెడ్డిని, వైసీపీలోని ముఖ్యనేతలను రఘురామరాజు విమర్శించేవారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఆయన తప్పుబడుతూ వచ్చారు.దీనికి తోడు సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో రఘురామకృష్ణం రాజు పిటీషన్ దాఖలు చేశారు.ప్రభుత్వంపై విమర్శలు చేయడమే కాకా సీఎం జగన్ని ఎలాగైనా జైలుకు పంపిచాలనే ఉద్దేశం రఘురామరాజుకు ఉందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.అయితే అరెస్టైన తరువాత బెయిల్పై బయటికి వచ్చిన రఘురామరాజు తన విమర్శనలను మానలేదు.
మొత్తానికి రఘురామకృష్ణం రాజు మాత్రం వైసీపీ ప్రభుత్వంపై యుద్దం ప్రకటించినట్లుగానే కనిపిస్తుంది.మొన్నటి వరకు రచ్చబండ పేరుతో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తే తాజా లేఖలతో మరోసారి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేపనిలో రఘురామరాజు ఉన్నారు.రఘురామకృష్ణం రాజు లేఖలను ప్రభుత్వం పట్టించుకుంటాదా లేదా అనేది పక్కనే పెడితే మీడియాలో మాత్రం రఘురామరాజు రోజు హైలెట్ అవుతుండటం విశేషం.